బుమ్రా బౌలింగ్లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొడతాడన్నారు.. కానీ ఒమన్తో మ్యాచ్లో గోల్డెన్ డక్..(ఫోటోలు- Samayam Telugu)
ఆసియాకప్ 2025లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు గడువు సమీపిస్తోంది. మరో రెండు రోజుల్లో దాయాదుల పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు.. నోటికి పని చెప్పారు. తమ ఆటగాళ్లు సత్తాచాటతారని.. భారత్ను ఓడిస్తారని జోస్యం చెబుతున్నారు. ఇక ఆ దేశ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ మరో అడుగు ముందుకేశాడు. పాక్ జట్టులోని 23 ఏళ్ల ప్లేయర్.. బుమ్రా బౌలింగ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కొడతానని గొప్పలు చెప్పుకున్నాడు.
“ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో పాకిస్థాన్ యువ ఓపెనర్ సయీమ్ ఆయూబ్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కొడతాడు” అని తన్వీర్ అహ్మద్ సంచలన కామెంట్స్ చేశాడు. అయితే ఈ కామెంట్స్ విన్న నెటిజన్లు.. తన్వీర్పై ట్రోల్స్ చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే కలలు కనండి.. ఎందుకంటే మ్యాచ్ ప్రారంభమయ్యాక అవి నిజం కావని తెలిసిపోతుంది కదా.. అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
కాగా తన్వీర్ అహ్మద్.. పొడిగిన సయీమ్ ఆయుబ్ వయసు కేవలం 23 ఏళ్లే. రెండేళ్ల క్రితం పాకిస్థాన్ తరఫున డెబ్యూ చేసిన ఈ ప్లేయర్.. తన కెరీర్లో ఇప్పటివరకు 42 టీ20 మ్యాచ్లు ఆడాడు. అందులో 136 స్ట్రైక్ రేట్తో 816 రన్స్ స్కోరు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే తన్వీర్ అహ్మద్ పొగిడిన సయీమ్ ఆయుబ్.. ఒమన్తో మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. బుమ్రా బౌలింగ్లు సిక్స్లు కొట్టడం ఏమో గానీ.. ఒమన్తో మ్యాచ్లో తొలి బంతికే ఔట్ అయ్యాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
దీంతో తన్వీర్పై ట్రోల్స్ మరింత పెరిగాయి. ఇతడేనా బుమ్రా బౌలింగ్లో సిక్స్లు కొట్టేది అనే ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఈ ఓపెనింగ్ బ్యాటర్.. బుమ్రా బౌలింగ్లో కనీసం క్రీజులో అయినా నిలబడతాడా? అని ప్రశ్నిస్తున్నారు. నోటికి వచ్చినట్లు కామెంట్లు చేసి.. పరువు పోగొట్టుకోవద్దని హితభోద చేస్తున్నారు. భారత్, పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa