ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినీతి పాలనని కూటమి అంతం చేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 04:46 PM

వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ఇవాళ (ఆదివారం) విశాఖపట్నంలో బీజేపీ సారథ్యం యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడారు. బీజేపీ సారథ్యం యాత్ర విజయవంతంగా సాగిందని ఉద్ఘాటించారు. వైసీపీ అవినీతి పాలనకు కూటమి చరమగీతం పాడిందని చెప్పుకొచ్చారు. ఎన్డీయే పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని నొక్కిచెప్పారు. 2014కు ముందు దేశంలో అసమర్థ, వారసత్వ ప్రభుత్వాలు ఉండేవని విమర్శించారు. 2014 తర్వాత దేశంలో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని జేపీ నడ్డా సూచించారు. వైఎస్ జగన్ అక్రమాలు మొత్తం బయటపెడతామని జేపీ నడ్డా హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa