తిరుపతి ట్రాన్స్పోర్ట్కు టెక్నాలజీ టచ్
రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన బస్ స్టేషన్ నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (NHLML), ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ఈ కొత్త ప్రాజెక్ట్తో తిరుపతిని అంతర్జాతీయ స్థాయిలో మలచాలని స్పష్టం చేశారు.
విశాలమైన ప్లానింగ్ – బస్సుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఒకేసారి 150 బస్సులు నిలిపి ఉంచగలిగే బస్ బేలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాకపోకల విభజన కోసం రెండు ఎంట్రీలు, రెండు ఎగ్జిట్ వేలు ఉండేలా డిజైన్ చేయాలన్నారు. అంతేకాకుండా, ప్రాజెక్ట్ స్థలాన్ని కనీసం 13 ఎకరాల విస్తీర్ణంలో రూపొందించాలని సూచించారు.
స్వయం సమృద్ధి – సోలార్ విద్యుత్, హెలిపాడ్, రోప్వే
ఈ బస్ స్టేషన్కు సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసి, విద్యుత్ అవసరాలను స్వయంగా తీర్చుకునేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. అదనంగా, హెలిపాడ్, రోప్వే వంటి ఆధునిక సదుపాయాలను కూడా ప్రతిపాదించారు. ఈ విధంగా ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణ మార్గాలను అందుబాటులోకి తేవాలని ఆశిస్తున్నారు.
కమర్షియల్ కాంప్లెక్స్లు – ఆదాయ మార్గాలకు గ్రీన్ సిగ్నల్
ప్రయాణికుల అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని మాల్స్, మల్టీప్లెక్స్లు, ఇతర కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా ఈ ప్రాజెక్ట్లో భాగంగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. రోజుకు కనీసం లక్ష మంది ప్రయాణికులు ఈ సెంటర్ ద్వారా రాకపోకలు సాగించే విధంగా ప్లానింగ్ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa