అభివృద్ధికి సూచిక వేగం కాదు
దేశ అభివృద్ధి రహదారుల వేగంతో కాకుండా, మానవ జీవితాల విలువతో నిర్ణయించాలి అని డబ్ల్యూహెచ్వో ఇంజ్యూరీ కొలాబరేటింగ్ సెంటర్ కో డైరెక్టర్ డాక్టర్ జుగ్నూర్ పేర్కొన్నారు. "మన దేశం ఎంత వేగంగా పరుగులు తీస్తోంది" అనే ప్రశ్న కంటే, "మన దేశం ఎన్ని ప్రాణాలను రక్షిస్తోంది" అన్నదే అసలైన కొలమానం కావాలని స్పష్టం చేశారు.
ప్రమాదాలపై తాజా అధ్యయనం స్పష్టత
ఢిల్లీలోని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ చేసిన తాజా అధ్యయనం ప్రకారం, రోడ్డుపై అతి వేగమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా వెల్లడైంది. బీఎంజే జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, వాహనాల సగటు వేగాన్ని 10 కిలోమీటర్ల వరకు తగ్గిస్తే సుమారు 40 శాతం ప్రమాదాలు నివారించవచ్చని తేలింది.
బండిపై బయలుదేరితే సురక్షితంగా తిరిగిరావడం దేవుడి దయపై
ఈ రోజుల్లో వాహనం తీసుకొని బయటకు వెళ్లిన వారు సురక్షితంగా తిరిగిరావడం దైవాధీనంగా మారింది. ప్రతి రోజు మారుతున్న ట్రాఫిక్ పరిస్థితులు, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే ప్రవర్తన, వేగం పరాకాష్టకు చేరడం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి.
వేగ నియంత్రణతోనే ప్రాణాల రక్షణ సాధ్యం
పరిమిత ప్రజారవాణా సదుపాయాల కారణంగా వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా పెరుగుతోంది. దీంతో పాటు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వాహనదారులు నియమ నిబంధనలు పాటించడమే కాక, వేగాన్ని తగ్గించడమూ అత్యవసరం. ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుని, వేగపరిమితులను అమలు చేయించాల్సిన అవసరం తీవ్రంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa