ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంట మనిషిపై.. దారుణానికి తెగబడ్డ పదో తరగతి విద్యార్థులు

Crime |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 09:02 PM

స్కూల్‌లో మద్యం ఎందుకు తాగుతున్నారని ప్రశ్నించినందుకు వంట మనిషిపై విద్యార్థులు దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన మండలంలోని గొల్లనపల్లి ఎస్సీ బాలుర హాస్టల్‌లో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లనపల్లి గ్రామ సమీపంలో ఉన్న జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఉంటున్నారు. కొంత మంది విద్యార్థులు శనివారం సాయంత్రం హాస్టల్‌ భవనంపై కూర్చొని మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో హాస్టల్‌లో పని చేస్తున్న గొల్లనపల్లికి చెందిన కాశిమ్మ అనే వంట మనిషి విద్యార్థులను చూసింది. స్కూల్‌ ఆవరణలో ఇలాంటి పనులేంటని ప్రశ్నించింది. ఈ విషయాన్ని హాస్టల్‌ వార్డెన్‌కు చెబుతానని హెచ్చరించి వంట చేసేందుకు కిందకు వెళ్లింది.విద్యార్థులు కొద్ది సేపటి తర్వాత వంట గదిలో కూరగాయలు కోస్తున్న కాశిమ్మపై దుప్పటి కప్పి తీవ్రంగా దాడి చేశారు. గొంతు నులిమి హత్య చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో విద్యార్థులు వెళ్లిపోయారు. కొద్దిసేపటికి తేరుకున్న కాశిమ్మ విషయాన్ని ఫోన్‌లో కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు వైద్య చికిత్స నిమిత్తం ఆమెను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సుమారు ఏడుగురు విద్యార్థులు తనపై దాడిచేసినట్లుగా కాశిమ్మ ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa