ఏపీ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ చేపట్టింది. గత కొన్ని రోజులుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియ చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సోమవారం మరోసారి పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. సోమవారం ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్న ధాత్రి రెడ్డిని.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా నియమించింది. కృష్ణా జిల్లా జేసీగా ఉన్న గీతాంజలి శర్మను ఏపీ ఫైబర్నెట్ ఎండీగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాడేరు సబ్ కలెక్టర్గా ఉన్న శౌర్యమాన్ పటేల్ను మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఐపీఎస్ అధికారి ఐపీఎల్ రాహుల్ దేవ్ శర్మకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా పూర్తిస్థాయిలో అదనపు బాధ్యతలను అప్పగించారు. రాహుల్ దేవ్ శర్మకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీఎస్బీసీఎల్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే డిస్టిలరీస్ అండ్ బ్రేవరీస్ కమిషనర్గా పూర్తి స్థా్యి బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జీవో జారీ చేశారు.
మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మను నియమించింది ప్రభుత్వం. ప్రవీణ్ ఆదిత్య స్థానంలో గీతాంజలి శర్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొన్ని నెలల కిందట ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారం రాష్ట్రస్థాయిలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఫైబర్ నెట్ ఛైర్మన్గా ఉన్న జీవీ రెడ్డి.. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ మీద సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది.
ఆ తర్వాత పరిణామాల్లో జీవీ రెడ్డిని సీఎం చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడటం.. కొన్ని రోజులకే జీవీ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజకీయంగా సంచలనం రేపింది. ఆ తర్వాత ఫైబర్నెట్ ఎండీ దినేష్ కుమార్ను సైతం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రవీణ్ ఆదిత్యను నియమించగా.. తాజాగా ప్రవీణ్ ఆదిత్య స్థానంలో ఐఏఎస్ ఆఫీసర్ గీతాంజలి శర్మను ఫైబర్ నెట్ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa