ఆసియా కప్ 2025లో యూఏఈ తొలి విజయం సాధించింది. ఒమన్తో జరిగిన మ్యాచ్లో 42 పరుగుల తేడాతో యూఏఈ క్రీడాకారులు గెలిచారు. యూఏఈ తొలుత 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.కెప్టెన్ మహ్మద్ వసీమ్ (69; 54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు) మరియు అలీషన్ షరాఫ్ (51; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో బాగా మెరిశారు. ఈ జోడీ తొలి వికెట్కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మహ్మద్ జోహైబ్ 21, హర్షిత్ కౌశిక్ 19* పరుగులు చేశారు. అసిఫ్ ఖాన్ 2 పరుగులకే బయటయ్యారు.లక్ష్య ఛేదనలో ఒమన్ జట్టు బలహీనంగా ప్రదర్శించింది. 18.4 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఆర్యన్ బిస్త్ (24) అత్యధిక పరుగులు సాధించాడు. జతిందర్ సింగ్ (20), వినాయక్ శుక్లా (20), షకీల్ అహ్మద్ (14), జితేన్ రామనంది (13) కూడా సాయం చేశారు. యూఏఈ బౌలర్లు జునైద్ సిద్ధిక్ 4 వికెట్లు, హైదర్ అలీ 2, మహ్మద్ జవదుల్లా 2, రోహిద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు. ఒమన్కు ఇది రెండో వరుస ఓటమి.క్రికెట్ ఆడేందుకు మేము వచ్చాం.. పాక్కు కఠినమైన ప్రతిస్పందన ఇస్తామనే సంకల్పంతో ఉన్నాం: 'కరచాలనం' వివాదంపై సూర్య మహ్మద్ వసీమ్ కొత్త రికార్డు సాధించాడు ఈ మ్యాచ్లో యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీమ్ ఒక కొత్త రికార్డు నెలకొల్పారు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోస్ బట్లర్ను మించి, అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప బంతుల్లో 3,000 పరుగులు సాధించిన బ్యాట్స్మెన్గా పేరు గడిపాడు. బట్లర్ 2,068 బంతుల్లో ఈ మైలురాయిని దాటినప్పటికీ, మహ్మద్ వసీమ్ 1,947 బంతుల్లోనే 3,000 పరుగులు పూర్తిచేశారు. ఇప్పటికే ఆరాన్ ఫించ్ (2,077), డేవిడ్ వార్నర్ (2,113), రోహిత్ శర్మ (2,149) కూడా ఈ ఘనతను పొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa