ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీ మార్పులు,,,8 వికెట్లు పడ్డా బ్యాటింగ్‌కు రాని సూర్యకుమార్‌

sports |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 10:33 PM

ఆసియాకప్‌లో పసికూన ఒమన్‌తో మ్యాచ్‌ను భారత క్రికెట్ జట్టు ప్రయోగాలకు ఉపయోగించుకుంది. గత రెండు మ్యాచ్‌లలో తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సూపర్‌-4 మ్యాచ్‌లకు ముందు బ్యాటింగ్ డెప్త్‌ను చెక్ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ చాలా మార్పులు చేసింది. సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ .. ఈ మ్యాచ్‌లో 8 వికెట్లు పడ్డా డగౌట్‌లోనే కూర్చున్నాడు. చివరికి బ్యాటింగ్‌కు అస్సలు రాలేదు.


రెగ్యులర్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌లే ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. గిల్ (5) ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఔట్ అయ్యాడు. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు వస్తాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (1), అక్షర్ పటేల్ (26), శివమ్ దూబె (5) క్రీజులోకి వచ్చారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే తిలక్ వర్మ.. ఏడో స్థానంలో ప్యాడ్లు కట్టుకుని మైదానంలోకి వచ్చాడు. 18 బంతుల్లో 29 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. తిలక్ ఔట్ అయ్యాక కూడా సూర్యకుమార్ క్రీజులోకి రాలేదు.


 ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో భారత్..8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (45 బంతుల్లో 56 రన్స్‌) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హర్షిత్ రాణా (8 బంతుల్లో 13 రన్స్‌), కుల్‌దీప్ యాదవ్‌ (1) నాటౌట్‌గా నిలిచారు. కాగా బ్యాటింగ్ డెప్త్‌ను చెక్ చేసేందుకే ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ బ్యాటింగ్‌కు దిగలేదు. తొమ్మిదో వికెట్ పడుంటే మాత్రం అతడు కచ్చితంగా బ్యాటింగ్‌కు రావాల్సిన పరిస్థితి ఉండేది. కానీ అలా జరగలేదు. మొత్తంగా సూపర్‌-4 మ్యాచ్‌లకు ముందు ఈ మ్యాచ్‌లో భారత జట్టు.. తమ బ్యాటింగ్‌ను పరీక్షించింది. ఇందులో విజయవంతం అయ్యిందనే చెప్పొచ్చు. గిల్, హార్దిక్, శివమ్ దూబె మినహా మిగతా ప్లేయర్లు ఫర్వాలేదనిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa