ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒమన్‌తో మ్యాచ్.. సూర్య కుమార్ షాకింగ్ డెసిషన్

sports |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 10:37 PM

ఆసియాకప్ 2025లో చివరి గ్రూప్‌ మ్యాచ్ ప్రారంభమైంది. అబుదాబీ వేదికగా భారత్, ఒమన్‌ మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సూర్య తన నిర్ణయం చెప్పిన వెంటనే స్టేడియం ఫ్యాన్స్ అరుపులతో మార్మోగిపోయింది. ఎందుకంటే ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ రెండు మ్యాచ్‌లు ఆడింది. అందులో రెండుసార్లు సెకండ్ బ్యాటింగ్ చేసింది. దీంతో భారత బ్యాటర్ల మెరుపులు చూడలేకపోయారు ప్రేక్షకులు. అయితే ఈసారి మాత్రం ఫస్టు బ్యాటింగ్ చేస్తుండటంతో.. ఫ్యాన్స్ ఫుల్ కుషీ అవుతున్నారు. మరి అభిమానుల ఆశలను టీమిండియా బ్యాటర్లు నెరవేరుస్తారా? లేదా అన్నది మరికాసేపట్లో తేలిపోనుంది.


కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి నిచ్చారు. ఇక.. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సైతం తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ ఇద్దరు స్థానంలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలు ప్లేయింగ్ లెవెన్‌లోకి వచ్చారు. ఈ టోర్నీలో గత రెండు మ్యాచ్‌లలో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగింది. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం ఇద్దరు పేసర్లతో ఆడుతోంది. మరోవైపు ఒమన్‌ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఇప్పటికే భారత్.. సూపర్‌-4కు చేరింది. ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసియాకప్ 2025లో ఇదే చివరి గ్రూప్ మ్యాచ్ కావడం గమనార్హం. రేపటి నుంచి సూపర్‌-4 మ్యాచ్‌లు జరుగుతాయి.


తుది జట్లు


భారత్‌:


అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్


ఒమన్‌:


అమీర్ కలీమ్, జతీందర్ సింగ్ (కెప్టెన్‌), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్‌), షా ఫైసల్, జిక్రియా ఇస్లాం, ఆర్యన్ బిష్త్, మొహమ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ, జితేన్ రామానంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa