డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరల పెంపుపై ఉన్న శ్రద్ధ కూటమి ప్రభుత్వానికి రైతులపై లేదని వైయస్ఆర్సీపీ నేత, కడప ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి తప్పుపట్టారు. శనివారం వైయస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులతో ఎంపీ చర్చించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, మేయర్ సురేష్ బాబు తదితరులు హాజరయ్యారు. అనంతరం వైయస్ అవినాష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..`ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ పిలుపు మేరకు నిర్వహించిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం అన్ని చోట్ల విజయవంతం అయింది. పోలీసులను ప్రయోగించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా వైయస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీల వద్దకు తరలివచ్చారు. మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని కూటమి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa