ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదే జరిగితే ఎన్నికల్లో పోటీ చేయను,,,,తేజస్వి యాదవ్ హెచ్చరిక

national |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 08:09 PM

బిహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. దీంతో ప్రధాన పార్టీలన్ని దూకుడు పెంచాయి. ఈక్రమంలో ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ఇండియా కూటమి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదని.. అదే జరిగితే తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటాను అని స్పష్టం చేశారు. త్వరలోనే ఇండియా కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో క్లారిటీ వస్తుందన్నారు. బిహార్ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ప్రస్తుతం పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈక్రమంలో తాజాగా తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


తాజాగా తేజస్వి యాదవ్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియా కూటమి సీఎం అభ్యర్థి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించకుండా.. ఇండియా కూటమి ఎన్నికల్లో పోటీ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పైగా ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖాలు లేని బీజేపీ వాళ్లమా.. అసలు సీఎం క్యాండెట్ లేకుండా ఎలక్షన్‌లో ఎలా పోటీ చేస్తాము అంటూ ప్రశ్నించారు. సీట్ల పంపిణీ అంశం పూర్తి కాగానే.. ముఖ్యమంత్రి అభ్యర్థి అంశంపై క్లారిటీ వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం క్యాండెట్‌ని ప్రకటించకపోతే.. తాను ఎన్నికల్లో పోటీ చేయనని తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు.


కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ-తేజస్వి యాదవ్ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా నిలబెట్టి లోక్‌సభ బరిలో దిగుతామని తెలిపారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరును ప్రకటించలేదు. అసలు దీని గురించే మాట్లాడలేదు.


తాజాగా తేజస్వి యాదవ్ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రశ్నించగా.. తేజస్వి యాదవ్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. కాస్త ఆగండి.. ముఖ్యమంత్రిని నిర్ణయించేది.. ఎన్నకునేది ప్రజలే. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరూ అనేది ప్రధానం కాదు. బిహార్‌ని తిరిగి నిర్మించాలి. ఇదే మా ముందున్న ప్రధాన లక్ష్యం అని తెలిపారు. అయితే సీట్ల పంపకం పూర్తయ్యాక.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటామని.. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోతే.. తాను ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ఆయన స్పష్టం చేశారు.


త్వరలో బిహార్‌ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అక్టోబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. రెండు, మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల దశల్లో పోలింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీపావళి పండుగ నాటికి బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa