ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ వేడుకలో కానుకలు ఇవ్వొద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 21, 2025, 05:25 PM

తిరుమలలో కొలువైన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం గొడుగుల ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీవారికి ప్రతి ఏడాది చెన్నై నుంచి గొడుగులు సమర్పిస్తారు. దీనిలో భాగంగా.. తమిళనాడులోని తిరుముల్లేవాయల్, తిరువళ్లూర్ మీదుగా ఊరేగింపుగా గొడుగులు తిరుమలకు చేరుకుంటాయి. వీటిని గరుడసేవ నాడు స్వామి వారికి అలంకరిస్తారు. ఈక్రమంలో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) భక్తులకు కీలక అలర్ట్ జారీ చేసింది. గొడుగుల ఉత్సవంలో భక్తులు ఎవరూ కానుకుల సమర్పింవద్దని సూచించింది.


తిరుమలలో కొలువైన శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో త్వరలోనే సాలకట్ల బ్రహ్మెత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ప్రారంభం అయ్యే బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 2వరకు కొనసాగుతాయి. స్వామి వారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ కూడా నిర్వహిస్తుంటారు. ఆ రోజున స్వామి వారికి అలంకరించే గొడుగులను ప్రత్యేకంగా చెన్నై నుంచి తిరుమలకు ఊరేగింపుగా తీసుకువస్తారు. ఈక్రమంలో టీటీడీ గొడుగుల ఊరేగింపుకు సంబంధించి భక్తులకు కీలక అలర్ట్ జారీ చేసింది. ఈ కార్యక్రమంలో భక్తులు ఎవరూ కానుకలు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేసింది. గొడుగుల ఉత్సవం సందర్భంగా భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని.. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.


ప్రతి ఏటా తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా.. పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి తిరుమలకు గొడుగులను ఊరేగింపుగా తీసుకొచ్చి.. శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అలానే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ నాడు స్వామికి అలంకరించే గొడుగులు.. సెప్టెంబర్ 27న ఆలయానికి చేరుకుంటాయి. మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 28న సాయంత్రం 6.30 నుంచి రాత్రి వరకు శ్రీవారికి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తమిళనాడు నుంచి వచ్చిన గొడుగులను స్వామి వారికి అలంకరిస్తారు.


తిరుమలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే వార్షిక ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా వీటిని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను చూడటం కోసం లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. అలానే 2025లో తిరుమల స్వామి వారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 8-10 గంటల వరకు అలానే సాయంత్రం 7-9 గంటల ప్రాంతంలో స్వామి వారు అమ్మవార్లతో కలిసి వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవం సమయంలో స్వామి వారిని దర్శించుకోవడం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa