ఆసియా కప్ 2025 టోర్నీ ముగిసిన రోజుల వ్యవధిలోని టీమిండియా.. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇందుకోసం మంగళవారం లేదా బుధవారం భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. అయితే అండర్సన్, సచిన్ టెస్ట్ సిరీస్లో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ .. ఈ సిరీస్కు ఎంపికయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ అక్టోబర్ 2 నుంచే ప్రారంభం కానుంది. అంటే ఇంకా పది రోజుల సమయం ఉంది. కానీ పాదానికి తీవ్ర గాయం కావడంతో ఆసియాకప్కు దూరమైన పంత్.. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్కు సైతం దూరం కానున్నాడని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్గా ఎంపికకానున్నాడు. అతడికి బ్యాకప్ వికెట్ కీపర్గా నారయణ్ జగదీషన్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా వైస్ కెప్టెన్గా పంత్ వ్యవహరించాడు. అతడు లేకపోవడంతో గిల్కు డిప్యూటీగా కేఎల్ రాహుల్ నియమితుడయ్యే అవకాశం ఉంది.
ఇక ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో నిరాశపరిచిన కరుణ్ నాయర్కు చోటు దక్కకపోవచ్చు. ఆసియా కప్ 2025 టోర్నీకి దూరంగా ఉన్న మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం భారత్-ఏ కెప్టెన్గా ఆస్ట్రేలియా-ఏతో అనధికారిక టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. అతడు టెస్ట్ టీమ్లోకి రానున్నాడు. దేవ్దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ సైతం రేసులో ఉన్నారు. గాయం నుంచి కోలుకున్న నితీశ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ముమ్మర సాధన చేస్తున్నాడు. అతడు సైతం వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్కు ఎంపికకానున్నాడు.
భారత్, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్..
తొలి టెస్ట్: అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
రెండో టెస్ట్: అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa