ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జపాన్‌లో వినూత్న ప్రయోగానికి సిద్ధపడ్డ ఒక నగరం

international |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 09:13 PM

జపాన్‌లోని ఓ నగరం వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రజలు వినోదం కోసం స్మార్ట్‌ఫోన్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్ల వాడకాన్ని రోజుకు కేవలం రెండు గంటలకు పరిమితం చేయాలని కోరుతూ ఒక ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. ఐచి రాష్ట్రంలోని టోయోవాకే మున్సిపల్ అసెంబ్లీ ఈ మేరకు మంగళవారం మెజారిటీ ఓటుతో తీర్మానం చేసింది. జపాన్‌లో ఇలాంటి నిబంధన తీసుకువచ్చిన తొలి నగరంగా టోయోవాకే నిలిచింది.ఈ కొత్త నిబంధన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఇది కేవలం ఒక మార్గదర్శకం మాత్రమేనని, దీన్ని ఉల్లంఘించిన వారిపై ఎలాంటి జరిమానాలు విధించబోమని నగర పాలక సంస్థ స్పష్టం చేసింది. చదువు, ఆఫీస్ పనులు, ఇంటి పనుల కోసం ఎలక్ట్రానిక్ పరికరాలను వాడుకోవడానికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని నగర మేయర్ మసఫుమి కౌకి వివరిస్తూ, "ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే మా ప్రధాన లక్ష్యం. స్మార్ట్‌ఫోన్ల వాడకం వల్ల నిద్రలేమి వంటి సమస్యలు వస్తున్నాయో లేదో ప్రజలు గమనించుకోవాలి. మేము స్మార్ట్‌ఫోన్‌లను వ్యతిరేకించడం లేదు, కానీ వాటి వాడకంలో పరిమితులు ఉండాలని కోరుతున్నాం" అని తెలిపారు. కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు పెంచడం కూడా ఈ ఆర్డినెన్స్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa