ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు దేశవ్యాప్తంగా BSNL 4జీ సేవలు ప్రారంభం

business |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 02:24 PM

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) స్వదేశీ 4జీ సేవలు శనివారం నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుండడం విశేషం. ఇది క్లౌడ్ ఆధారిత నెట్‌వర్క్ అని, భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టు 5జీకి సులువుగా అప్‌గ్రేడ్‌ అవ్వొచ్చని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. సెప్టెంబర్‌ 27న బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలను దేశవ్యాప్తంగా సుమారు 98 వేల సైట్లలో అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa