ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మేము చర్యలు తీసుకోకపోతే ఉగ్రవాదులు వీధుల్లో తిరిగేవారు',,, పాక్ ప్రధాని

international |  Suryaa Desk  | Published : Sun, Sep 28, 2025, 08:36 PM

 పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల అధినేతలతో పాటు నెటిజెన్లు అందరినీ తెగ నవ్విస్తున్నాయి. ఎందుకుంటే ఉగ్రవాదానికి పట్టినిళ్లు అయిన పాకిస్థాన్.. ఉగ్రవాదులను ఏరివేస్తోందని ఆయన అన్నారు. ముఖ్యంగా తమ దేశం ఉగ్రవాదాన్ని అదుపు చేయకపోతే.. ఆ ఉగ్రవాదులు న్యూయార్క్, లండన్ వీధుల్లో తిరిగుతూ ఉండేవారని షరీఫ్ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజెన్లు అంతా నవ్వుకుంటున్నారు. మరికొందరేమో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. "పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని నియంత్రించకపోతే.. ఉగ్రవాదులంతా లండన్, అమెరికా వీధుల్లో తిరిగేవారు" అని అన్నారు. ఈయన చేసిన వ్యాఖ్యాలతో వీడియో కాసేపట్లోనే నెట్టింట వైరల్ కాగా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజెన్లు అయితే.. పాకిస్థాన్ నిజంగా ఉగ్రవాదుల గ్లోబల్ హబ్ అని అంగీకరించిందని అన్నారు.


  మరో యూజర్ అయితే.. పాకిస్థాన్‌లో న్యూయార్క్, లండన్‌ను ముంచెత్తేంత మంది ఉగ్రవాదులు ఉన్నారని పాక్ ప్రధాని స్వయంగా అంగీకరించారని చెప్పుకొచ్చారు. మరో నెటిజెన్ అయితే వ్యంగ్యంగా స్పందించారు." ఈ దేశంలో పుట్టి, శిక్షణ పొంది, ఆర్థిక సహాయం పొందిన ఉగ్రవాదులను మేము భారత దేశంపైకి పంపి ఉండకపోతే.. వారు ఖాళీగా ఉండి అమెరికా, యూరప్ వీధుల్లో తిరుగుతూ ఉండేవారని అతను చెప్పి ఉండాల్సింది" అని అన్నారు.


పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగాన్ని భారత్ తీవ్రంగా తిప్పికొట్టింది. ఐరాసలో తన ప్రతీకార హక్కును వినియోగించుకున్న భారత్.. షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలను "అసంబద్ధమైన నాటకం" అని, ఆయన ఉగ్రవాదాన్ని కీర్తిస్తున్నారని ఆరోపించింది. ఐరాసలో భారత శాశ్వత మిషన్ మొదటి కార్యదర్శి పేటల్ గహ్లోత్ మాట్లాడుతూ.. మే నెలలో జరిగిన సైనిక సంఘర్షణలో పాకిస్థాన్ విజయం సాధించిందని షరీఫ్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.


ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న పాకిస్థాన్ తన పాత్రను కప్పిపుచ్చుకోవడానికి "అసంబద్ధమైన కథనాలను" ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలను రక్షించడానికి ఇస్లామాబాద్ ప్రయత్నించిందని ఆమె మండిపడ్డారు. మే నెలలో జరిగిన సంఘర్షణపై షరీఫ్ ఇచ్చిన వివరణను కూడా ఆమె తిరస్కరించారు. మే 10న భారత బలగాలు పాకిస్థాన్‌లోని పలు ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశాయని.. ఆ తర్వాతే పాకిస్థాన్ బెదిరింపులు ఆగిపోయాయని పేటల్ గహ్లోత్ గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa