కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు పెరిగిపోయాయని, అందుకే అన్యాయానికి గురైన వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకువైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్ ఆవిష్కరించారని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి, మాడుగుల, పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలికుడు పైలా శ్రీనివాసరావు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి అదిప్రాజ్ డిజిటల్ బుక్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి రికార్డులతో చేరవేయడానికి జననేత జగనన్న ఎంచుకున్న బాణం డిజిటల్ బుక్ అని అన్నారు. డిజిటల్ బుక్లో నమోదు చేసే ప్రతి సమస్యను అధికారం చేపట్టిన వెంటనే పరిష్కరించడం జరుగుతుందని జగనన్న కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారని చెప్పారు. ఎవరైనా ఇబ్బందులు పెడితే 040–49171718 నంబర్కు కాల్ చేసి తమ సమస్యలు చెప్పవచ్చన్నారు. వైయస్ఆర్సీపీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కలసికట్టుగా పని చేయాలని కోరారు. డిజిటల్ బుక్పై గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఆగడాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కోన రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు, వెన్నెల పాలెం సర్పంచ్ వెన్నెల అప్పారావు, భరణికం సర్పంచ్ పెదిశెట్టి పూజ శేఖర్, బొద్దపు చిన్నారవు, పైల సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ కావలి రాజు, పల్లా గోవింద్, పూర్ణ శర్మ, శేష సురేష్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa