వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాంచ్ చేసిన డిజిటల్ బుక్ పార్టీ కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని వైయస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. కూటమి పాలనలో అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సోమవారం శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వైయస్ఆర్సీపీ డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ను అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్, నియోజకవర్గ పరిశీలకులు ఎల్.ఎం. మోహన్రెడ్డి, నేతలు, కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. అన్యాయాలపై ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సూచించారు. అలాంటి వారు వెంటనే డిజిటల్ బుక్లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. నమోదు చేసిన సమస్యలు నేరుగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి వెళ్తాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని అన్నారు. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి వైయస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa