అనారోగ్యం బారినపడిన తన కుమారుడి చికిత్సకు ఉన్నదంతా ఖర్చుచేసిన ఓ తండ్రి.. అవి సరిపడకపోవడంతో రూ.12 లక్షలు అప్పుచేశాడు. ఈ అప్పులు తీర్చడానికి ఉపాధిని వెతక్కొంటూ గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. అక్కడ సంపాదించిన డబ్బులతో అప్పులు తీరిపోతాయని భావించాడు. ఈ క్రమంలో రెండు నెలల కిందట సౌదీకి వెళ్లి పనిలో కుదిరాడు. కానీ, అక్కడ కూడా అతడ్ని అదృష్టం వెక్కిరించింది. పనిలోకి పెట్టుకున్న యజమాని జీతం ఇవ్వకపోగా.. అతడ్ని చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. నిత్యం నరకం చూపించడంతో తనను కాపాడాలని, తక్షణమే ఇక్కడ నుంచి ఇండియాకు తీసుకెళ్లేందుకు సాయం చేయాలని వేడుకుంటూ ఓ వీడియోను పంపాడు. తనను ఎలాగైనా రక్షించాలంటూ ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావులకు మొరపెట్టుకున్నాడు అనంతపురం జిల్లాకు చెందిన ఆ బాధితుడు.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం పట్టణానికి చెందిన నిజాం అనే వ్యక్తి.. తన కుమారుడికి కిడ్నీ సంబంధిత సమస్య రావడంతో ఆసుపత్రిలో చేర్చించాడు. చికిత్స కోసం తమ వద్ద ఉన్న డబ్బులతో పాటు మరో రూ.12 లక్షలు అప్పుచేశాడు. ఈ అప్పులు తీర్చే స్థోమత లేకపోవడంతో రెండు నెలల కిందట సౌదీకి ఉపాధి కోసం వెళ్లాడు. కానీ, అక్కడ యజమాని పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా నిత్యం చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వాపోతూ ఓ వీడియో సందేశం పంపాడు. పది రోజులుగా తాను రోడ్డుమీదే ఉన్నానని, చాలా ఇబ్బందులు పడుతున్నానని వాపోయాడు.
డ్రైవర్ ఉద్యోగం కోసం ఇక్కడకు వచ్చానని, యజమాని రోజూ తనను ఇష్టమొచ్చినట్టు కొడుతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన భార్యాపిల్లలు ఎంతో ఎదురుచూస్తున్నారని, ఇక్కడ ఎవ్వరూ సహాయం చేసేవారు లేరని నిజాం ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు అప్పజెపుతానని బెదిరిస్తున్నాడని, పది రోజుల నుంచి భోజనం కూడా లేదని తెలిపాడు. మసీదులోనే ఉంటున్నానని, ఇండియన్ ఎంబసీతో మాట్లాడి తనను ఇక్కడ నుంచి తరలించి, అనంతపురం తీసుకొచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నావల్ల కావడం లేదని, దయచేసిన నన్ను కాపాడండి అని వేడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా, గతంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి.. అక్కడ చిత్రహింసలకు గురై పలువుర్ని ఏపీ ప్రభుత్వం భారత్కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని భారత రాయబారి కార్యాలయం అధికారులను సంప్రదించి, బాధితులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. గల్ఫ్లో చిక్కుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన మహిళ వీడియో పెట్టడంతో లోకేష్ స్పందించి ఆమెను క్షేమంగా వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa