ట్రెండింగ్
Epaper    English    தமிழ்

H-1B వీసాలపై ట్రంప్ సర్కార్ కఠిన నిబంధనలు

international |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 08:38 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠినమైన హెచ్-1బీ వీసా నిర్ణయాలు, భారత టెక్ రంగానికి పరోక్షంగా మేలు చేసేలా కనిపిస్తున్నాయి. వీసా నిబంధనలను కఠినతరం చేస్తుండటంతో, అమెరికన్ కంపెనీలు తమ కీలకమైన ప్రాజెక్టులను, ఉన్నత స్థాయి పనులను భారత్‌లోని తమ కార్యాలయాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామం దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల  అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని ఆర్థిక నిపుణులు, పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇటీవల ట్రంప్ సర్కార్ కొత్త H-1B వీసా దరఖాస్తు ఫీజును ప్రస్తుతం ఉన్న 2,000-5,000 డాలర్ల నుంచి ఏకంగా లక్ష డాలర్లకు పెంచింది. దీనికి తోడు, సోమవారం కొందరు యూఎస్ సెనేటర్లు H-1B, L-1 వీసా ప్రోగ్రామ్‌లలోని లోపాలను సరిదిద్దేందుకు ఓ కొత్త బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ఈ పరిణామాలతో అమెరికాలో విదేశీ నిపుణులను నియమించుకోవడం కంపెనీలకు మరింత వ్యయభరితంగా, సంక్లిష్టంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించిన సంస్థలు, భారత్‌లోని తమ జీసీసీలను ఆశ్రయిస్తున్నాయి.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీసీసీలలో సగానికి పైగా, అంటే దాదాపు 1,700 సెంటర్లు ఒక్క భారత్‌లోనే ఉన్నాయి. ఇవి కేవలం టెక్ సపోర్ట్ కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ప్రాడక్ట్ డెవలప్‌మెంట్, సైబర్‌సెక్యూరిటీ, అనలిటిక్స్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వంటి అత్యంత కీలకమైన విభాగాల్లోనూ పనిచేస్తున్నాయి.ఈ విషయంపై డెలాయిట్ ఇండియా భాగస్వామి రోహన్ లోబో మాట్లాడుతూ, "ఈ సమయంలో జీసీసీలు చాలా కీలక పాత్ర పోషించనున్నాయి. ఇప్పటికే పలు అమెరికన్ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్ వ్యూహాలను పునఃసమీక్షిస్తున్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసులు, టెక్నాలజీ రంగాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది" అని వివరించారు.అనేక కంపెనీలకు జీసీసీలను ఏర్పాటు చేయడంలో సహాయపడిన ఏఎన్ఎస్ఆర్  వ్యవస్థాపకుడు లలిత్ అహూజా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "ఈ మార్పుపై కంపెనీల మధ్య తీవ్రమైన చర్చ జరుగుతోంది. త్వరగా నిర్ణయాలు తీసుకోవాలనే ఆత్రుత కనిపిస్తోంది" అని ఆయన తెలిపారు. నిపుణుల అంచనా ప్రకారం, వీసా నిబంధనలు ఇలాగే కొనసాగితే, అమెరికాలోని వ్యూహాత్మక ఉద్యోగాలు సైతం భారత్‌కు తరలిరావడం ఖాయంగా కనిపిస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa