అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన పాత పాటే పాడుతున్నారు. భారత్–పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే నిలిపేశానని మరోసారి ప్రకటించారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఈ రెండు దేశాల మధ్య పెద్ద స్థాయిలో యుద్ధం జరుగబోతోందని, అది తాను అడ్డుకున్నానని ట్రంప్ చెప్పారు.ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్, పాకిస్థాన్పై ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, తర్వాత ఇరు దేశాల మిలిటరీ అధికారుల చర్చల తర్వాత భారత్ తాత్కాలికంగా సీజ్ఫైర్ ప్రకటించింది. అయినా, ట్రంప్ మాత్రం ఇది తన చొరవ వల్లే సాధ్యమైందంటూ పదే పదే పేర్కొంటున్నారు.తాజాగా క్వాంటికోలో మిలిటరీ అధికారులతో జరిగిన సమావేశంలో ట్రంప్ మరోసారి ఈ వ్యాఖ్యలు చేశారు.“నేను చాలా యుద్ధాలను ఆపేశాను. అందుకే మన దేశం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. 9 నెలల్లో 7 యుద్ధాలకు ముగింపు పలికాను. నిన్నటి రోజు అత్యంత ప్రమాదకరమైన యుద్ధాన్ని కూడా నిలిపేశాను – అదే భారత్-పాకిస్థాన్ యుద్ధం. అవి న్యూక్లియర్ పవర్ కలిగిన దేశాలు” అని వ్యాఖ్యానించారు.ఇక ఈసమయంలో ఇజ్రాయెల్–గాజా విషయంలోనూ ట్రంప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెరికా 21 పాయింట్ల శాంతి ప్రణాళికను ప్రతిపాదించింది. గాజాలో యుద్ధ విరమణ జరిగి, భవిష్యత్తులో పాలస్తీనా దేశం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రణాళిక ఉద్దేశ్యంగా ఉంది. అలాగే హమాస్ బందీలుగా ఉంచిన వారిని వెంటనే విడుదల చేయాలన్న పాయింట్ కూడా అందులో ఉంది.ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, “మేము ఈ సమస్యను పరిష్కరించాం అనుకుంటున్నాను. కానీ ఏం జరుగుతుందో చూడాలి. హమాస్ మా షరతులను అంగీకరించాలి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు” అని హెచ్చరించారు.ఇక భారత్–పాకిస్థాన్ యుద్ధంపై మే 10 నుంచి ట్రంప్ సామాజిక మాధ్యమాల్లోనూ, పలు అంతర్జాతీయ వేదికలలోనూ తన వ్యాఖ్యలతో హల్చల్ చేస్తూనే ఉన్నారు. మే 10న ట్రూత్ సోషల్లో పెట్టిన పోస్టులో “భారత్, పాకిస్థాన్ తక్షణమే సీజ్ఫైర్కు అంగీకరించాయి. ఇది అమెరికా మధ్యవర్తిత్వంతో, మేము నిర్వహించిన ‘లాంగ్ నైట్ టాక్స్’ కారణంగా సాధ్యమైంది" అని పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యను ట్రంప్ ఇప్పటి వరకు దాదాపు 50 సార్లు పునరావృతం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa