రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ సమీపంలో ఉన్న ఆరావళి కొండలలో ప్రతిష్టాత్మకంగా వెలసిన ఇడాన మాత ఆలయం, భక్తుల విశ్వాసానికి చిహ్నంగా నిలుస్తోంది. ఈ ఆలయంలో వెలసిన అమ్మవారు అగ్ని సహితం కనిపించే ప్రత్యేకతను కలిగి ఉన్నారు. ఆలయంలో ఎప్పుడు అగ్ని చెలరేగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ ఆ అగ్ని నుంచి అమ్మవారి విగ్రహానికి ఏ మాత్రం మసి అంటకపోవడం భక్తుల్లో ఆధ్యాత్మిక భయం మరియు భక్తిని కలిగిస్తోంది.
ఈ అగ్ని ప్రమాదాలు తరచూ జరిగి, ఆలయంలో అలంకరణ వస్తువులు కాలిపోతున్నప్పటికీ, అమ్మవారి విగ్రహం మాత్రం ఏ నష్టాన్ని చవించకుండా కనిపిస్తుంది. ఇది అమ్మవారి దివ్యశక్తికి నిదర్శనమని భక్తులు అంటున్నారు. ఈ అపూర్వ ఘటన ప్రతి సంవత్సరం కొన్ని సార్లు జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అప్పట్లో ఆలయ ప్రాంగణంలో ఉన్నవారు ఈ అగ్ని దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తారు.
అమ్మవారు అగ్ని ద్వారా తనను తాను శుద్ధి చేసుకుంటారని, ఇది శక్తి మేల్కొనే సంకేతమని భక్తుల నమ్మకం. అగ్ని అనేది అమ్మవారి ఒక రూపంగా భక్తులు భావిస్తారు. ఈ కారణంగానే, ఈ ఆలయంలో ఎలాంటి అగరుబత్తులు లేదా మండే పదార్థాలను వెలిగించరు. అగ్ని తనంతట తానే చెలరేగడం, తిరిగి అదమటం అనేది ఎప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది.
ఇలాంటి అపురూపమైన విశేషాలతో ఇడాన మాత ఆలయం రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాక, దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందింది. సంవత్సరంలో ప్రత్యేక వేళల్లో వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. అక్కడి వాతావరణం, అగ్ని పవిత్రత, భక్తుల విశ్వాసం అన్నీ కలసి ఒక అనుభూతిని కలిగిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa