కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జ్వరం మరియు కాలి నొప్పితో బాధపడుతున్న ఆయనను మంగళవారం బెంగళూరులోని ఎం.ఎస్. రామయ్య ఆసుపత్రికి తరలించారని పార్టీ వర్గాలు బుధవారం వెల్లడించాయి.
ఆసుపత్రిలో ఖర్గేకు తగిన వైద్యసేవలు అందిస్తున్నట్టు సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
కాంగ్రెస్ వర్గాల ప్రకారం, ఖర్గే ఆరోగ్య పరిస్థితి విషమంగా లేదని, సాధారణ వైద్యపర్యవేక్షణకే ఆయనను ఆసుపత్రిలో చేర్పించినట్టు వెల్లడించారు. జ్వరం తగ్గకపోవడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
పార్టీ నాయకులు, కార్యకర్తలు ఖర్గే ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా, వైద్యుల నుంచి వెలువడిన సమాచారం మేరకు ఆయన త్వరలోనే కోలుకుని బయటపడతారని ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రజల ప్రార్థనలు ఆయన ఆరోగ్యం మరింత మెరుగవ్వడానికి తోడ్పడాలని పలువురు నేతలు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa