ఇటీవలి కాలంలో విమానాల్లో జరుగుతున్న సంఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రయాణికులు, ఎయిర్లైన్స్ సిబ్బంది పలువురు చేస్తున్న ఘటనలతో విమానాల్లో ప్రయాణించాలంటేనే జనం భయపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ విమానంలో జరిగిన సంఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఓ వ్యక్తి, అందులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగాడు. మొదట చిన్న చిన్నగానే మొదలైన వారి గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేను.. సదరు వ్యక్తి అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ నుంచి ఉత్తర్ప్రదేశ్ రాజధాని లఖ్నవూకు మంగళవారం బయల్దేరి వెళ్తున్న ఎయిరిండియాకు చెందిన ఏఐ-837 విమానంలో ఈ ఘటన జరిగింది. ఇక అదే విమానంలో యూపీలోని అమేథీకి చెందిన గౌరీగంజ్ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్సింగ్ కూడా ప్రయాణిస్తున్నారు. సమద్ అనే ఒక ప్రయాణికుడు, ఎమ్మెల్యేకు మధ్య తొలుత చిన్న ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలోనే సమద్ గట్టిగా అరవడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు మొత్తం ఏం జరిగిందని అతని వైపు చూశారు.
ఇంతలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్సింగ్.. సమద్కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ వ్యక్తి ఊరుకోలేదు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాకేష్ను సమద్ అసభ్య పదజాలంతో తిట్టడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేపై దురుసుగా ప్రవర్తించాడు. ఇక ఈ ఘటన మొత్తం విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత జరిగింది. ఈ ఘటనతో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు మొత్తం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక పరిస్థితి తీవ్రంగా మారడంతో కలగజేసుకున్న ఎయిరిండియా విమానయాన సిబ్బంది.. వారి మధ్య గొడవను పరిష్కరించారు.
ఇక ఆ ఎయిరిండియా విమానం లఖ్నవూలో ల్యాండ్ అయిన తర్వాత సమద్ అనే వ్యక్తిపై ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్సింగ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు ఫతేపుర్ జిల్లాకు చెందిన సమద్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఆ తర్వాత ఈ ఘటపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. పౌరులకు వాక్ స్వేచ్ఛ ఉంది కదా.. అని ఎవరు పడితే వారు.. ఎవరిని పడితే వారి గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని ఈ ఘటన తర్వాత ఎయిర్పోర్టు బయటికి వచ్చిన ఎమ్మెల్యే రాకేష్ మీడియాతో మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa