ఏపీలో దేశంలోనే అతిపెద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కానుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అతిపెద్దిదిగా మారబోతోందని మత్స్య, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, మత్స్య శాఖ కమిషనర్ రామ్శంకర్నాయక్తో కలిసి హార్బర్ను సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ హార్బర్ను తన ఆధీనంలోకి తీసుకుని పూర్తిగా ఉపయోగంలోకి తీసుకురానుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో హార్బర్ను సందర్శించి మత్స్యకారులకు భరోసా ఇస్తారన్నారు.
హార్బర్ నిర్వహణకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు.. ఏటా రూ. 825 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కమిటీ హార్బర్ నిర్వహణ బాధ్యతలను మత్స్యకార సంఘాలకు ఇవ్వాలా, లేక ప్రైవేటు సంస్థలకు అప్పగించాలా అని నిర్ణయిస్తారన్నారు. ఈ హార్బర్ నుంచి ప్రతి ఏటా 41,250 టన్నుల చేపల సంపద లభిస్తుందన్నారు. మరోవైపు ఈ ఫిషింగ్ హార్బర్ దగదర్తి ఎయిర్పోర్ట్కు దగ్గరలోనే ఉంది. అంతేకాదు కృష్ణపట్నం పోర్ట్కు కూడా దగ్గరగా ఉంది. నేషనల్ హైవే 16కు కూడా కనెక్టివిటీ ఉండటంతో ఫిషింగ్ హార్బర్కు అన్ని విధాలా ఉపయోగంగా ఉంటుందంటున్నారు.
మరోవైపు నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం సముద్రతీరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయబోయే భూములను సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీన ఆధ్వర్యంలో కేంద్ర బృందం పరిశీలించింది. భూముల మ్యాప్ను పరిశీలించారు.. పూర్తి వివరాలతో ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని సబ్ కలెక్టర్ తెలిపారు. ఇటు దగదర్తి ఎయిర్పోర్ట్కు సంబంధించి భూ సేకరణపై అధికారులు ఫోకస్ పెట్టారు. మొదటి దశ పనుల కోసం రూ.916 కోట్లు కేటాయించనున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంటుంది అంటున్నారు. అలాగే బీపీసీఎల్ ప్రాజెక్టు కూడా రాబోతోంది. మొత్తం మీద నెల్లూరు జిల్లాకు కీలకమైన ప్రాజెక్టులు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa