గాజాలో శాంతిస్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్న వేళ కూడా, ఇజ్రాయెల్ తన దాడులను ఆపలేదు. శనివారం గాజాపై జరిపిన దాడుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామం శాంతి ప్రక్రియపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది.స్థానిక అధికారుల కథనం ప్రకారం, గాజా సిటీలోని ఒక ఇంటిపై జరిగిన దాడిలో నలుగురు, దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్లో జరిగిన మరో దాడిలో ఇద్దరు మరణించారు. బందీల విడుదల, యుద్ధ విరమణ లక్ష్యంగా ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి హమాస్ సానుకూలంగా స్పందించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం. అంతకు ముందు, ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలపడంతో, ఇజ్రాయెల్ కూడా ఒప్పందంలోని మొదటి దశను తక్షణమే అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. బందీల విడుదలను ఈ దశలో చేపట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa