ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరేబియా సముద్రంపై పాకిస్తాన్ కన్ను.. అమెరికా సాయం

international |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 08:57 PM

ఇటీవల అమెరికాతో పాకిస్తాన్ స్నేహం పెరిగిపోయింది. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించడం.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఏకంగా వైట్‌హౌస్‌లోనే భేటీ కావడం.. అమెరికా, పాక్ దోస్తీ ఎంత వరకు ఉందో తెలుస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్‌లోని చమురు నిల్వలను డెవలప్ చేస్తామని ట్రంప్ ప్రకటించడంతో ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే ఇదంతా భారత్‌, పాక్ మధ్య ఇటీవల ఆపరేషన్ సిందూర్ జరిగిన తర్వాత చోటు చేసుకోవడం గమనార్హం. భారత్ అంటే దూరం పెడుతున్న ట్రంప్.. పాకిస్తాన్‌తో మాత్రం సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అండతో ఇప్పుడు పాక్.. అరేబియా సముద్రంపై కన్నేసింది. అక్కడ పోర్టు నిర్మాణం చేసేందుకు అమెరికా సాయం కోరినట్లు తెలుస్తోంది.


అమెరికా, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు బలపడిన వేళ.. తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అరేబియా సముద్రంలో పోర్టు నిర్మించే విషయంపై అమెరికా అధికారులను పాకిస్తాన్ సంప్రదించినట్లు కథనలు వెలువడుతున్నాయి. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌ ఇటీవల అమెరికాలో పర్యటించి సమయంలోనే ఈ ప్రతిపాదనలను అమెరికా అధికారుల ముందు పెట్టినట్లు ఫైనాన్షియల్ టైమ్స్‌ కథనం వెలువరించింది.


అరేబియా సముద్రంలో పోర్టు నిర్మించే అంశాన్ని యూఎస్‌ అధికారుల ముందు అసిమ్ మునీర్ ఉంచారు. ఈ పోర్టు ద్వారా.. పాకిస్తాన్‌లోని పాస్నీ ప్రాంతంలో లభించే ముఖ్యమైన ఖనిజాల రవాణాకు ఉపయోగించుకోవాలని పాక్‌ భావిస్తోంది. పాక్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో అఫ్గానిస్తాన్‌- ఇరాన్‌ సరిహద్దుల్లో ఉన్న పాస్నీ ప్రాంతం అనేది ఒక ఓడరేవు పట్టణం. అయితే అసిమ్ మునీర్‌ అమెరికాలో పర్యటించడానికి ముందే.. ఆయన అడ్వైజర్లు యూఎస్‌ అధికారులతో ఈ పోర్టు నిర్మాణంపై చర్చలు జరిపినట్లు సమాచారం.


అయితే.. ఈ పోర్టు నిర్మించిన తర్వాత దాన్ని అమెరికా ఉపయోగించుకోవడానికి.. మరీ ముఖ్యంగా ఆర్మీ బేస్‌ల కోసం వినియోగించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఇక ఈ పోర్టును వినియోగించుకోవడానికి బదులుగా అమెరికాను పశ్చిమ పాకిస్తాన్‌లోని ఖనిజాలు లభించే ప్రావిన్స్‌లకు అనుసంధానించే రైలు కారిడార్‌ను డెవలప్ చేసేందుకు నిధులు కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రైల్వే టెర్మినల్‌ ప్రాజెక్ట్ గురించి అమెరికా కానీ.. పాక్‌ గానీ ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa