ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మూడు ప్రధాన నేతలు — ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ — కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ముగ్గురు ఆయా పార్టీల నుంచి ముందుకు వచ్చి, కూటమి పాలనను ఒక కొత్త దిశగా నడిపిస్తున్నారు.బీజేపీ తరఫున ప్రధాని మోదీ, టీడీపీ తరఫున చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కల్యాణ్ — మూడూ ఒకే మార్గంలో, ఒకే లక్ష్యంతో కలిసి పనిచేస్తున్నారు. గత 15 నెలలుగా ఈ ముగ్గురు నేతలు సమన్వయంతో ముందుకు సాగుతున్న పరిస్థితి, కూటమి దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నాయనే సంకేతాల్ని ఇస్తోంది.ఈ కూటమి ఇప్పుడిప్పుడే కాదు, గత ఎన్నికల సమయంలో కూడా భారీగా ప్రచారం నిర్వహించింది. ముఖ్యంగా విశాఖలో జరిగిన మోదీ, బాబు, పవన్ కల్యాణ్ రోడ్ షోకు భారీ జనసంద్రం హాజరైంది. ఆ వేళ ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రచారం తర్వాత వచ్చిన ఫలితాల్లో కూటమి ఘనవిజయం సాధించింది.ఇప్పుడు అదే ముగ్గురు మరోసారి ఒకే ఫ్రేమ్లో — ఈసారి రాయలసీమలో!ప్రధానమంత్రి మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతానికి పర్యటనకు రానున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మోదీ శ్రీశైలం దేవస్థానాన్ని దర్శించుకుని, అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్లతో కలిసి కర్నూలులో రోడ్ షోలో పాల్గొననున్నారు.జీఎస్టీ సంస్కరణలపై ప్రజలలో అవగాహన పెంచేందుకు ‘జీఎస్టీ ఉత్సవ్’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది కూటమి. ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొననున్నారు.గతంలో మే 2న అమరావతిలో రూ.49,000 కోట్లతో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మోదీ, జూన్లో విశాఖలో జరిగిన 'యోగాంధ్ర' ఈవెంట్లో 15,000 మందితో కలిసి యోగా చేశారు. ఈ కార్యక్రమాల్లో కూటమి ఐక్యత స్పష్టంగా కనిపించింది.రాయలసీమపై కూటమి స్పెషల్ ఫోకస్గతంలో కడపలో టీడీపీ మహానాడు గ్రాండ్గా జరిపిన తర్వాత, పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతాల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించి కూటమి తన బలాన్ని చాటుకుంది. ఇప్పుడీ బలాన్ని మరింత బలోపేతం చేయడానికి మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి రాయలసీమలో భారీ షోకు రంగం సిద్ధం చేస్తున్నారు.చంద్రబాబు వరుసగా రాయలసీమ పర్యటనలు చేస్తూ ‘నీళ్లు, నిధులు’ అనే సంకేతాలతో ప్రజల్లో నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కడపలో పర్యటిస్తూ జనసేన క్యాడర్కు మరింత దగ్గర అవుతున్నారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్ కూడా తన పర్యటనలు రాయలసీమ నుంచే ప్రారంభించారు.కూటమి వ్యూహం: రాయలసీమలో గట్టి పునాది .కూటమి మళ్లీ గతంలో విజయం సాధించిన 52 సీట్ల లక్ష్యాన్ని కళ్ల ముందు పెట్టుకొని వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఈ వ్యూహంలో భాగంగా రాయలసీమలో పార్టీ నేతల పునరుత్తేజం, కేడర్ మోబిలైజేషన్, అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శన వంటి అంశాలపై దృష్టి పెట్టారు.ఈ రోడ్ షోతో రాయలసీమ ప్రజల్లో మళ్లీ మద్దతు లభించేలా చేయాలనే లక్ష్యంతో కూటమి మూడూ పార్టీలు — బీజేపీ, టీడీపీ, జనసేన — ఐక్యంగా పని చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa