ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమె వెర్రిది....! గ్రెటా థన్‌బర్గ్‌పై ట్రంప్ ఫైర్

international |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 09:47 PM

గాజాపై ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తున్న వారిలో.. ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ఒకరు. ఆమె ఇటీవల గాజాలో మానవ నవతాసాయం అందించేందుకు 170 మంది ఇతర కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. ఓ ప్రత్యేక నౌకలో వెళ్తున్న థన్‌బర్గ్‌ను ఇజ్రాయెల్ అడ్డుకుంది. అనంతరం వారిని స్వదేశాలకు పంపించింది. అయితే దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిచారు. గ్రెటా థన్‌బర్గ్ ఒక ట్రబుల్‌మేకర్ అని, వెర్రి మనిషి అంటూ ఫైర్ అయ్యారు. ఆమె వైద్యులను సంప్రదించాల్సిందిగా సూచించారు.


"అమెకు (గ్రెటా థన్‌బర్గ్) యాంగర్ మేనేజ్‌మెంట్ సమస్యలు ఉన్నాయి. ఆమె వైద్యులను సంప్రదించాలి. మీరు ఎప్పుడైనా ఆమెను చూసి ఉంటే.. ఈ వయసులో ఆమెకు చాలా కోపం ఉంది. ఆమె చాలా వెర్రిది. గ్రెటా కేవలం సమస్యలు సృష్టించే కార్యకర్త మాత్రమే" అని డొనాల్డ్ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


గాజాకు ఆహారం, నీరు, వైద్య సామాగ్రిని తీసుకువెళుతున్న'గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా' అనే నౌకలో.. గ్రెటా థన్‌బర్గ్‌ సహా దాదాపు 450 మంది కార్యకర్తలను ఇటీవల ఇజ్రాయెల్ భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. రెండేళ్ల తర్వాత గాజాలో కరవు వంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఐరాస వెల్లడించిన నేపథ్యంలో.. ఈ సామాజిక కార్యకర్తలు.. నౌకలో ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అరెస్టైన తర్వాత వారం రోజుల పైటు ఇజ్రాయెల్ నిర్భందంలోనే ఉన్నారు గ్రెటా. ఇజ్రాయెల్ భద్రతా దళాలు విడిచిపెట్టిన తర్వాత సోమవారం గ్రెటాతో సహా 160 మంది కార్యకర్తలు గ్రీస్‌కు చేరుకున్నారు. గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా నౌకలోని ఇంకా 138 మంది.. తమ నిర్భందంలోనే ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.


నిర్బంధంలో ఉంచిన సమయంలో ఇజ్రాయెల్ దళాలు తనతో దుర్భాషలాడినట్లు థన్‌బర్గ్‌ వెల్లడించారు. ఇజ్రాయెల్ కస్టడీలో దారుణమైన పరిస్థితితులు ఉన్నాయని థన్‌బర్గ్ స్వీడిష్ అధాకారులకు చెప్పారు. కాగా, థన్‌బర్గ్‌ను బగ్‌లు ఉన్న సెల్‌లో ఉంచారని.. ఆహారం, నీళ్లు కూడా సరిగా లేవని స్వీడిష్ అధికారులు తెలిపారు. ఆమెను నేలపై ఈడ్చుక్కెళ్లి.. ఇజ్రాయెల్ జెండాను ముద్దాడాలని బలవంతం చేశారని ఓ టర్కిష్ జర్నలిస్ట్, సుముద్ ఫ్లోటిల్లాలో ఉన్న ఎర్సిన్ సెలిక్ అనే వ్యక్తి స్థానిక మీడియాతో చెప్పారు.


గతంలో కూడా గ్రెటా థన్‌బర్గ్‌ గాజాకు మానవతా సాయం అందించడానికి గాజా వైపు వెళ్లారు. జూన్‌లో నౌకతో ఇజ్రాయెల్ వైపు వెళ్తున్న గ్రెటా థన్‌బర్గ్‌.. సహా 12 మంది ఉద్యమకారులను అదుపులోకి తీసుకుంది ఇజ్రాయెల్ సైన్యం. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా.. పాలస్తీనియన్లకు సాయం అందించేందుకు నౌకను ‘ఫ్రీడమ్‌ ఫ్లొటిల్లా అలెయన్స్‌’ అనే సంస్థ ఏర్పాటు చేసింది. కాగా, నౌకలోకి ఇజ్రాయెలీ కమాండోలు అక్రమంగా ప్రవేశించారని.. నిరాయుధులైన సిబ్బందిని కిడ్నాప్‌ చేశారని ఫ్రీడమ్ ఫ్లోటిలా సంస్థ అప్పుడు ఆరోపించింది. ఇజ్రాయెల్ వీరిని తిరిగి వారి స్వదేశాలకు పంపించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa