అల్మెరేలోని బీట్రిక్స్ పార్క్లో జరిగిన దాడిలో తనకు చెందిన 10 తేనెతుట్టెలను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారని డచ్ తేనెటీగల పెంపకందారు హరోల్డ్ స్ట్రింగర్ వెల్లడించారు. ఈ దాడిలో దాదాపు 5 లక్షల తేనెటీగలు మృతిచెందాయి.తేనెతుట్టె ఒక్కటిలో సగటున 40,000 నుంచి 60,000 తేనెటీగలు ఉంటాయని ఆయన చెప్పారు. ‘‘ఇంత పెద్ద మొత్తంలో జీవులు ఉద్దేశపూర్వకంగా నాశనం చేయబడ్డాయంటే భయంగా ఉంది’’ అన్నారు.స్థానిక ప్రసార సంస్థ Omroep Flevolandకు మాట్లాడుతూ, ‘‘నా తేనెతుట్టెలను కోల్పోయిన బాధ మాటల్లో చెప్పలేను’’ అని స్ట్రింగర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం కోరుతూ నగరంలోని అల్మెరే వెస్ట్ పోర్ట్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.ప్రమాదం జరిగిన ప్రాంతంలోని తేనెతుట్టెలను తగలబెట్టేందుకు ఎక్స్లెరెంట్ అనే జ్వలన పదార్థం ఉపయోగించినట్లు స్ట్రింగర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.డచ్ ప్రభుత్వ ప్రకారం, నెదర్లాండ్స్లో తేనెటీగల 360 జాతుల్లో సగానికి పైగా అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల జనాభా క్రమంగా తగ్గుతోంది.తన తేనెతుట్టెలన్నీ నాశనమవడం బాధాకరమని, అయినా తానే మళ్లీ కొత్త కాలనీతో ప్రారంభిస్తానని స్ట్రింగర్ నిశ్చయంగా తెలిపారు. తొమ్మిదేళ్లుగా తేనెటీగల సంరక్షణలో ఉన్న ఆయన, ఈ ఘటనతో వెనక్కి తగ్గే ఉద్దేశం తనకు లేదన్నారు.అంతేకాక, అతని స్నేహితురాలు మరియు తేనెటీగల పెంపకందారు హెలీన్ నీమాన్, ‘‘నా వద్ద ఉన్న మూడు తేనెతుట్టెలలో ఒకదాన్ని ఆయనకు ఇస్తాను’’ అంటూ మద్దతుగా నిలిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa