ఐపీఎల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ వేలానికి రంగం సిద్ధమవుతోంది. 19వ ఎడిషన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ డిసెంబర్ 14న జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే డిసెంబర్ 13న కూడా నిర్వహించేందుకు వీలుగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వర్గాలు ఫ్రాంచైజీలకు ప్రాథమిక సమాచారం అందించినట్లు వార్తలు వస్తున్నాయి. గత రెండు సీజన్లుగా విదేశాల్లో జరుగుతున్న వేలంపాట, ఈసారి మళ్లీ స్వదేశానికి తిరిగి రానుంది. గతంలో దుబాయ్, జెడ్డాలలో వేలం నిర్వహించగా, ఈసారి భారత్లోనే జరపాలని నిర్వాహకులు భావిస్తున్నారు. వేలానికి ఆతిథ్యం ఇచ్చే నగరాల జాబితాలో ముంబై, బెంగళూరు ముందువరుసలో ఉన్నాయి. ఆటగాళ్ల రిటెన్షన్కు సంబంధించి ఫ్రాంచైజీలు తమ తుది జాబితాను నవంబర్ 15లోగా సమర్పించాల్సి ఉంటుంది.గత సీజన్లో ఫాఫ్ డుప్లెసిస్ను వదులుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రజత్ పాటిదార్ కెప్టెన్సీలో తొలిసారి టైటిల్ను ముద్దాడింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ, తమ జట్టును మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ వేలంపై దృష్టి సారించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa