అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఏ1 ఖిలాడిగా ఉన్న విజయవాడలోని జనార్దన్ రావు అరెస్టును శనివారం చూపకపోతే, హైకోర్ట్లో పిటిషన్ వేస్తామని న్యాయవాది రవీంద్రా రెడ్డి తెలిపారు.న్యాయవాది రవీంద్రా రెడ్డి వివరించారు, “ఎక్సైజ్ పోలీసులు పట్టుకోవడానికి జనార్దన్ విదేశాల నుంచి వచ్చారని ముందస్తు సమాచారం ఇచ్చారు. ఆయనను విజయవాడకి తీసుకురావాలని, మదనపల్లి పోలీసులు లొంగిపోకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు. జనార్దన్ నుంచి బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. రేపు అరెస్టు చూపకపోతే హైకోర్ట్లో పిటిషన్ వేస్తాం. కేసులో ఏ4 రవి హైదరాబాదులో నేను సరెండర్ చేయిస్తే… ఇప్పటివరకు అరెస్టు చూపించలేదు. ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు కూడా పాత్రధారులే” అని న్యాయవాది పేర్కొన్నారు.జనార్దన్ రావు గన్నవరం ఎయిర్పోర్టులో ఈరోజు ఎక్సైజ్ పోలీసుల చేతిలో అదుపులోకి తీసుకోబడ్డాడు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడకు వస్తున్నట్లు తెలిసిన వెంటనే, ఆయనను ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల వారు ఆయనను విచారిస్తున్నారు.విచారణలో కల్తీ మద్యం తయారీ కేంద్రాలు ఇంకా ఎక్కడ ఉన్నాయో, మద్యం ఏ ఏ ప్రాంతాలకు సరఫరా చేయబడిందో, లిక్కర్ సిండికేట్లో పాల్గొన్నవారి వివరాలు పరిశీలిస్తున్నారు. ములకల చెరువులో కల్తీ మద్యం తయారీకి అండగా నిలిచిన వ్యక్తుల వివరాలు కూడా సేకరించుతున్నారు. అధికారులు రేపు కోర్టులో ఆయనను హాజరుపరచనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa