ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాపికొండల బోటు యాత్రకు గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 03:42 PM

AP: గోదావరి నదిపై పాపికొండల మధ్య బోటు విహారయాత్రలు తిరిగి ప్రారంభమయ్యాయి. మూడు నెలలుగా వరదల కారణంగా నిలిచిపోయిన ఈ యాత్రలకు ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్‌ వద్ద నీటిమట్టం తగ్గడంతో, దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం నుంచి 15 బోట్లు సిద్ధంగా ఉన్నాయి. పర్యాటకుల భద్రతకు నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో వారాంతపు సెలవుల్లో ఆహ్లాదకరంగా గడపాలనుకునే పర్యాటకులు ఈ యాత్రకు సిద్ధమవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa