ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 318/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. మరో 200 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. 518 స్కోరు వద్ద ధ్రువ్ జురెల్ ఐదో వికెట్ రూపంలో ఔట్ కాగానే.. నాన్స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న గిల్.. వెంటనే ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటింగ్ ముగిసినట్లయింది. తొలి ఇన్నింగ్స్లో 134.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన భారత్.. 5 వికెట్లు కోల్పోయి 518 పరుగులు చేసింది.
రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే సెంచరీ హీరో యశస్వి జైశ్వాల్ ఔట్ అయ్యాడు. మరో రెండు పరుగులు జోడించి 177 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి.. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే హాఫ్ సెంచరీకి చేరువయ్యాక అతడు ఔట్ అయ్యాడు. 54 బంతుల్లో 43 రన్స్ చేసి.. వారికన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు.
గత మ్యాచ్లో సెంచరీ చేసిన ధ్రువ్ జురెల్.. కెప్టెన్ గిల్కు జత కలిశాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో పరుగుల వరద పారించిన గిల్.. ఈ మ్యాచ్లో శతక్కొట్టాడు. అయితే జురెల్ (44) ఔట్ అయిన వెంటనే ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు. అప్పటికి అతడు 196 బంతుల్లో 129 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. కానీ వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఆలోచించకుండా ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేశాడు.
ఇక వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు. రోస్టన్ ఛేజ్ మరో వికెట్ పడగొట్టాడు. కాగా వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో భాగంగా భారత్ తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. రెండో టెస్టులోనూ విజయానికి బలమైన పునాది వేసుకుంది. బౌలర్లు సత్తాచాటితే మ్యాచ్ మూడు రోజుల్లో ముగిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa