ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాపట్ల.. బీచ్‌లో స్నానానికి వెళ్లి ఐదుగురు విట్ విద్యార్థులు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 08:32 PM

బాపట్ల జిల్లా చీరాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్టోబరు 12న ఆదివారం మధ్యాహ్నం వాడరేవు బీచ్‌లో సముద్ర స్నానానికి దిగిన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గుర్ని స్థానికులు రక్షించి, ఒడ్డుకు తీసుకొచ్చారు. వాడరేవుల బీచ్‌లో మొత్తం ఎనిమిది మంది యువకులు స్నానానికి దిగి, అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. వీరిలో ఐదుగురు మృతిచెందగా.. మిగతా ముగ్గుర్ని స్థానికులు కాపాడారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకున్నారు. మృతులను విట్ విద్యార్థులుగా గుర్తించారు.


 అమరావతిలోని విట్ యూనివర్సిటీలో చదువుతోన్న పలువురు విద్యార్థులు.. ఆదివారం కావడంతో వాడరేపు బీచ్‌కు వచ్చారు. విద్యార్థులు సముద్ర స్నానానికి దిగగా.. వీరిలో సాకేత్, సాయి, మణిదీప్, జీవన్, సాత్విక్ అనే ఐదుగురు అలల తాకిడికి కొట్టుకుపోయారు. దీనిని గమనించి స్థానిక మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. గల్లంతైన కాసేపటికి ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. సోమేష్‌, చీరాలకు చెందిన గౌతమ్‌ అనే విద్యార్థులు గల్లంతు కాగా.. వారి కోసం గాలింపు కొనసాగుతుంది.


అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలోనూ ఈ బీచ్‌లు ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. గతేడాది రెండు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు యువకులు మృతిచెందారు. దీంతో కొన్ని రోజుల పాటు బీచ్‌లో సందర్శకుల అనుమతి నిరాకరించారు.


ఇదిలా ఉండగా, దీనికి మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకోగా.. అక్కడ ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ వల్ల నలుగురు యువకులు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వారు సకాలంలో స్పందించి తమ ప్రాణాలకు తెగించి యువకులను రక్షించారు. కపిలేశ్వరానికి చెందిన అబ్దుల్ అసిఫ్, ఎస్‌కే ఆర్ఫాద్, ఎస్‌కే సికిందర్, షరీఫ్ అనే నలుగురు యువకులు ఆదివారం ఉదయం మంగిపూడి బీచ్‌కు వచ్చారు. వారు సముద్రంలో స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి కొట్టుకుపోసాగారు. వారిని వారిని గమనించిన అక్కడే ఉన్న నాంచారయ్య, శేఖర్‌ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు తక్షణమే స్పందించారు. వెంటనే సముద్రంలోకి వెళ్లి.. వారిని ఒడ్డుకు చేర్చారు. వారి సాహసంతో నలుగురు యువకులు ప్రాణాలు నిలిచాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa