ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను ఎన్నికల్లో పోటీచేయడం లేదు

national |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 03:12 PM

ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ (పీకే) సంచలన ప్రకటన చేశారు. నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. అయితే, ఆర్జేడీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా తేజస్వి కంచుకోట అయిన రాఘోపూర్ నియోజకవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి."నేను పోటీ చేయను. ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం. పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం నేను ప్రస్తుతం చేస్తున్న సంస్థాగత పనులనే కొనసాగిస్తాను" అని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. తేజస్వి యాదవ్‌పై రాఘోపూర్ నుంచి పీకే పోటీ చేస్తారంటూ వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa