లక్నో జోన్ (కమిషనరేట్)జోన్ పేరుఉత్తర్ప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చి దాదాపు 8.5 ఏళ్లు పూర్తి అవుతోంది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పటి నుంచి యూపీలో గ్యాంగ్స్టర్లు, కరుడు గట్టిన నేరస్థుల గుండెల్లో యోగి ఆదిత్యనాథ్ రైళ్లు పరిగెత్తిస్తున్నారు. యోగి దెబ్బకు.. చాలా మంది నేరగాళ్లు.. పోలీసులకు లొంగిపోతున్నారు. మరికొందరు రాష్ట్రం వదిలేసి పారిపోతున్నారు. ఇంకొందరు అన్ని దందాలు మూసేసి.. సాధారణ జీవితం బతుకుతున్నారు. ఇక యూపీలో ఒకప్పుడు గూండా రాజ్యం నడవగా.. ఇప్పుడు మాత్రం నేరాలు బాగా తగ్గిపోయాయని లెక్కలు చెబుతున్నాయి. ఇందుకు కారణం.. ఉత్తర్ప్రదేశ్లో నేరాలపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్న యోగి ఆదిత్యనాథ్ సర్కార్.. గ్యాంగ్స్టర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యోగి ఆదిత్యనాథ్ సీఎం కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి ఇప్పటివరకు యూపీలో జరిగిన ఎన్కౌంటర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ను తాజాగా విడుదల చేసింది.
యూపీలో నేరాలపై జీరో టాలరెన్స్ విధానం కింద 15,726 ఎన్కౌంటర్లు జరిగాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆపరేషన్లలో ఇప్పటివరకు 256 మంది కరడుగట్టిన నేరస్థులు హతమైనట్లు తెలిపింది. మొత్తంగా 31,960 మందిని అరెస్ట్ చేశారు. అత్యధికంగా మీరట్ జోన్లో 4,453 ఎన్కౌంటర్లు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక మీరట్ జోన్లో 85 మంది చనిపోయారు. నేరస్థులను అరికట్టేందుకు యోగి సర్కార్ తీసుకుంటున్న చర్యల కారణంగా.. వారు రాష్ట్రం విడిచి పారిపోతున్నారని.. ఉత్తర్ప్రదేశ్ ఇప్పుడు సురక్షితమైన రాష్ట్రంగా గుర్తింపు పొందుతోందని ప్రభుత్వం పేర్కొంది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని.. అధికార వర్గాలు అక్టోబర్ 14వ తేదీన ఒక ప్రకటన విడుదల చేశాయి. యోగి ప్రభుత్వం ఉత్తర్ప్రదేశ్లో శాంతి భద్రతలను పరిరక్షించడానికి కట్టుబడి ఉందనడానికి ఈ ఆపరేషన్లే నిదర్శనమని.. ప్రభుత్వం ఆ ప్రకటనలో వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa