ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీరు చేస్తే పుణ్యం, పక్కనోడు చేస్తే పాపమా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 16, 2025, 12:46 PM

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం అత్యంత దుర్మార్గం అని మార్గాని భరత్ అన్నారు. అయన మాట్లాడుతూ... పీపీపీకి ప్రైవేటైజేషన్ కి తేడా తెలియదని చెబుతున్నారు. మీరు తీసుకున్న ఆ విధానంలో పబ్లిక్ కు ఏ విధంగా మేలు జరుగుతుందో సమాధానం చెప్పాలి? రూ.4వేల కోట్లు మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధులు లేవని చెబుతున్న మీరు... అమరావతిలో రూ.70 వేల కోట్ల పనులకు ఏ విధంగా శంకుస్థాపనలు చేశారు. వాస్తవానికి మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేకుండా వైయస్.జగన్ వాటిని సిద్దం చేసి ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.2వేల కోట్లు పెట్టుబడి పెడితే... ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. విశాఖపట్నంలో రుషికొండ ఏపీ టూరిజం భవనాలు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవని పదే, పదే అబద్దాలు చెప్పారు. ఇవాళ రుషికొండ భవనాలను అమ్మేయడానికి నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది. మీరు చేస్తే పుణ్యం, పక్కనోడు చేస్తే పాపమా? ఎల్లో మీడియా అంతా కోడై కూస్తూ ప్రజలకు విషం ఎక్కించే కార్యక్రమం చేస్తుంది. అలా గతంలో రుషికొండకు బోడిగుండు చేశారని పదే పదే అబద్దాలు చెప్పిన మీరు ఈ భవనాలకు కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా? అని భరత్ ప్రభుత్వాన్ని నిలదీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa