ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల రోజుల్లో తురకపాలెం గ్రామంలో ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 16, 2025, 12:47 PM

గుంటూరు జిల్లా, తురకపాలెం గ్రామాన్ని సామాజిక బహిష్కరణ చేస్తుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోంది అని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ... గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నా ఇంతవరకు నారా లోకేష్‌ పరామర్శకు రాలేదు. కొన్ని బాధిత కుటుంబాలకు కేవలం రూ.5 లక్షలు పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకోవడం దుర్మార్గం. తక్షణం గ్రామానికి సురక్షిత మంచినీటి సరఫరా జరిపేలా శాశ్వతంగా పైపులైన్‌ నిర్మాణం చేపట్టాలి. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి సూచనతో గ్రామంలో ఆర్వో ప్లాంట్‌ను నెలరోజుల్లో ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa