వైద్య వృత్తిని అడ్డం పెట్టుకుని, కట్టుకున్న భార్యను హతమార్చిన ఓ వైద్యుడి కిరాతకం బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో చనిపోయిందని అందరినీ నమ్మించినా, ఆరు నెలల తర్వాత ఫోరెన్సిక్ నివేదిక అసలు నిజాన్ని బయటపెట్టడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో జనరల్ సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ మహేంద్ర రెడ్డి, డెర్మటాలజిస్ట్ అయిన డాక్టర్ కృతిక రెడ్డి భార్యాభర్తలు. వీరికి గత ఏడాది మే 26న వివాహం జరిగింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 21న మున్నెకొల్లాల్లోని వారి నివాసంలో కృతిక అస్వస్థతకు గురయ్యారని చెబుతూ ఆమె భర్త మహేంద్ర రెడ్డే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు.దీంతో మరాఠహళ్లి పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో క్రైమ్ ఆఫీసర్లు తనిఖీ చేయగా, ఓ కానిలా సెట్, ఇంజెక్షన్ ట్యూబ్ వంటి వైద్య పరికరాలు లభించాయి. వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపించారు. మృతురాలి అంతర్గత అవయవాల నమూనాలను కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.ఎఫ్ఎస్ఎల్ నివేదికలో కృతిక శరీరంలో 'ప్రోపోఫాల్' అనే శక్తిమంతమైన అనస్థీషియా (మత్తు) మందు ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో ఇది హత్యేనని నిర్ధారణ కావడంతో మృతురాలి తండ్రి అక్టోబర్ 13న తన అల్లుడే మత్తుమందు ఇచ్చి కూతురిని చంపాడని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వేగంగా స్పందించి, అక్టోబర్ 14న కర్ణాటకలోని మణిపాల్లో ఉన్న నిందితుడు మహేంద్రరెడ్డిని అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa