ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై పదో తరగతిలో 33 మార్కులకే పాస్ , కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Thu, Oct 16, 2025, 05:31 PM

పదో తరగతి విద్యార్థులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పబ్లిక్ పరీక్షలో పాస్ మార్కులు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతీ సబ్జెక్ట్ లో 33 మార్కులు తెచ్చుకుంటే పాస్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటీ అరా మార్కులతో పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని, దీనిని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కర్ణాటక మంత్రి మధు బంగారప్ప పేర్కొన్నారు.కిందటేడాది వరకు పదో తరగతిలో పాస్ కావాలంటే ప్రతి సబ్జెక్ట్‌లో తప్పనిసరిగా 35 శాతం మార్కులు తెచ్చుకోవాల్సిందే. ఒకటీ అరా మార్కులతో ఫెయిలైన విద్యార్థి తిరిగి సప్లిమెంటరీ పరీక్షల కోసం వేచి ఉండాలి. ఈ గ్యాప్ లో విద్యార్థులను వారి తల్లిదండ్రులు పనికి పంపించడం, ఆడపిల్లలైతే పెళ్లి చేసి పంపించడం చేస్తున్నారని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బంగారప్ప చెప్పారు. ఆ తర్వాత పిల్లలు చదువుకు శాశ్వతంగా దూరమవుతున్నారని తెలిపారు. దీనిని తప్పించేందుకు పాస్ మార్కులను 33 కు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం నుంచే ఈ రూల్ ను అమలు చేస్తామని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందని మంత్రి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa