ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్‌ మంత్రివర్గం పూర్తిగా మార్పు.. స్టార్ క్రికెటర్‌ భార్యకు మంత్రి పదవి

national |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 09:09 PM

మంత్రి పేరు గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని గుజరాత్ మంత్రివర్గాన్ని పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రులంతా నిన్న మూకుమ్మడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక వారి రాజీనామాలను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొత్త వారికి మంత్రులుగా అవకాశం కల్పించారు. మొత్తం 21 మంది ఎమ్మెల్యేల చేత గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు.. కేంద్రమంత్రి జేపీ నడ్డా హాజరయ్యారు.


గతంలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరికి మాత్రమే మంత్రులుగా తిరిగి కేబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు. ఇక మిగిలిన 19 మంది కొత్త ముఖాలే కావడం గమనార్హం. ఇక టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజాకు కూడా కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కింది. పాత మంత్రుల్లో హర్ష్ సంఘవి, ప్రఫుల్ పన్షేరియాలకు మాత్రమే మళ్లీ అవకాశం లభించింది.


మంత్రి పేరు


నియోజకవర్గం


హర్ష్ సంఘవి మజూర్ నియోజకవర్గం


ప్రఫుల్ పన్షేరియా కామ్రేజ్ నియోజకవర్గం


రివాబా జడేజా జామ్‌నగర్ ఉత్తర నియోజకవర్గం


జితేంద్ర వాఘాని భావ్‌నగర్ పశ్చిమ నియోజకవర్గం


నరేష్ పటేల్ గాందేవి నియోజకవర్గం


అర్జున్ మోఢ్వాడియా పోర్‌బందర్ నియోజకవర్గం


ప్రద్యుమన్ వాజా కోడినార్ నియోజకవర్గం


రమణ్ సోలంకి బోర్‌సద్ నియోజకవర్గం


ఈశ్వర్‌సిన్హ్ పటేల్ అంక్లేశ్వర్ నియోజకవర్గం


మనీషా వకీల్ వడోదర సిటీ నియోజకవర్గం


కాంతిలాల్ అమృతియా మోర్బి నియోజకవర్గం


రమేష్ కటారా ఫతేపురా నియోజకవర్గం


దర్శన వాఘేలా అసార్వా నియోజకవర్గం


కౌశిక్ వెకారియా అమ్రేలి నియోజకవర్గం


ప్రవీణ్ కుమార్ మాలి డీసా నియోజకవర్గం


జయరామ్ గామిత్ నిజార్ నియోజకవర్గం


త్రికమ్ ఛాంగా అంజర్ నియోజకవర్గం


కమలేష్ పటేల్ పేట్లద్ నియోజకవర్గం


సంజ‌య్‌సిన్హ్ మహీదా మహుధ నియోజకవర్గం


పూనంచంద్ చనాభాయ్ బరండా భిలోడ నియోజకవర్గం


స్వరూప్ ఠాకోర్ వావ్ నియోజకవర్గం


ఈ విస్తరణ ద్వారా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గంలో కొత్త శక్తిని నింపాలని చూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణకు ఒక రోజు ముందు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ మినహా.. 16 మంది మంత్రులు రాజీనామా చేశారు. 8 మంది కేబినెట్ స్థాయి మంత్రులు ఉండగా.. అదే సంఖ్యలో సహాయ మంత్రులు ఉన్నారు. మొత్తం 182 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో సభ మొత్తం సంఖ్యలో 15 శాతం లేదా 27 మంది మంత్రులు ఉండవచ్చు. 2022 డిసెంబర్ 12వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. 2027 గుజరాత్ ఎన్నికలకు ముందు.. ఆ రాష్ట్రంలో బీజేపీ కీలక చర్యలు చేపడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa