దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 20న ఢిల్లీలో మద్యం విక్రయంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించనున్నట్టు ఢిల్లీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు అధికారులు అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.దీనిని అనుసరించి, ఆ రోజు రాజధానిలో ఎటువంటి మద్యం దుకాణాలు తెరిచి ఉండకూడదు అని స్పష్టంగా పేర్కొన్నారు. పండుగ సమయంలో శాంతి భద్రతలు నిలబెట్టే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.మద్యం విక్రయదారులందరూ ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని, ఏవైనా ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.ఇలాంటివి ప్రతి సంవత్సరం పండుగల సమయంలో జరుగుతూ ఉంటాయని, ఇది ఒక ఆనవాయితీగా కొనసాగుతుందని, ప్రజలు కూడా ఈ నిషేధాన్ని గౌరవించాలని అధికారుల విజ్ఞప్తి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa