ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రహ్మోస్ బలం డబుల్.. 800 కీ.మీ. రేంజ్

national |  Suryaa Desk  | Published : Mon, Oct 20, 2025, 09:57 PM

ఆపరేషన్ సిందూర్‌లో బహ్మోస్ క్షిపణులు చూపించిన పరాక్రమం గురించి తెలిసిందే. నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై బ్రహ్మోస్ మిస్సైల్స్ విరుచుకుపడినప్పుడు.. పాకిస్థాన్ గజగజ వణికిపోయింది. ఈ విషయం స్వయంగా పాక్ ప్రధాని హెషబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా గతంలో చెప్పారు. దాడి సమయంలో బ్రహ్మోస్ క్షిపణులకు అణు వార్ హెడ్ ఉందా లేదా అని తెలుసుకునేందుకు తమ వద్ద 30- 45 సెకన్ల సమయం మాత్రమే ఉందని.. ఆ సమయంలో తడిచిపోయినంత పనైందన్న అర్థంలో గతంలో చెప్పుకొచ్చారు. బ్రహ్మోస్ మొదటి వెర్షన్‌కే పాక్, దానికి మద్దతిచ్చిన దేశాలు అల్లాడిపోతే.. ఇప్పుడు రెండో వెర్షన్ రెడీ అయింది. అంటే బ్రహ్మోస్ బలం ఇప్పుడు డబుల్ అయిందన్నమాట. 450 కిలోమీటర్ల రేంజ్ నుంచి 800 కిలోమీటర్లకు పెరిగింది.


బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి శబ్ద వేగం కంటే 2.8 రెట్లు అధిక వేగంతో దూసుకెళ్లగలదు. సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా వీటిని దీనిని ప్రయోగించవచ్చు. ఇప్పుడు దీని రేంజ్‌ను 800 కిలోమీటర్లకు పెంచారు. 2027 నాటికి ఈ వెర్షన్ క్షిపణి అందుబాటులోకి వస్తుందని అంచనాలున్నాయి. కాగా, ఈ వెర్షన్‌కు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పని.. దాదాపు పూర్తైపోయింది. ఇంకా ఇనర్షల్‌ నేవిగేషన్‌ సిస్టమ్- ఎక్స్‌టర్నల్‌ గ్లోబల్‌ నేవిగేషన్‌ సిస్టమ్ కాంబినేషన్‌కు సంబంధించిన పరీక్షలు జరగాల్సి ఉన్నట్లు సమాచారం. ఈ పరీక్షలు సక్సెస్ అయితే.. కొత్త తరం బ్రహ్మోస్ మిస్సైళ్లు 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు.


ఆధునిక కాలంలో యుద్ధాలు జరిగే తీరు మారిపోయింది. భారత్- పాక్ మధ్య మాత్రమే కాకుండా ఇజ్రాయెల్- గాజా, ఉక్రెయిన్- రష్యా యుద్ధాల్లో ఏం జరిగిందో చూస్తునే ఉన్నాం. గగనతల యుద్ధంలో ఫైటర్‌‌ జెట్‌లు నేరుగా తలపడటం చాలా అరుదుగా జరుగుతోంది. శత్రువును చాలా దూరంగానే గుర్తించి కూల్చివేయడం ఇప్పటి ప్లాన్. ఇందులో ఉండే బియాండ్‌ విజువల్‌ రేంజ్ (బీవీఆర్‌ ) క్షిపణుల పాత్ర అత్యంత కీలకం. కాగా భారత్‌ వద్ద అస్త్ర మార్క్‌-2 పేరిట బీవీఆర్‌ క్షిపణి ఇప్పటికే ఉన్న క్షిపణి రేంజ్ 160 కిలోమీటర్లు. ప్రస్తుతం వాయుసేన ఈ సామర్థ్యాన్ని 280 కిలోమీటర్లకు పెంచే పనిలో ఉంది. అస్త్ర మార్క్-1 క్షిపణి రేంజ్ కూడా పెంచుతున్నారు.


జమ్మూకాశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఆ సమయంలో బ్రహ్మోస్‌ క్షిపణులతో పాకిస్థాన్‌పై విరుచుకుపడింది. సుఖోయ్‌-30 ఎంకేఐ ఫైటర్స్‌తో.. పాక్‌లోని కీలక ప్రాంతాల్లో ఒకటైన రావల్పిండి సమీపంలో ఉన్న నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై బ్రహ్మస్‌ క్షిపణులతో విరుచుకుపడింది. అయితే బ్రహ్మోస్ యుద్ధక్షేత్రంలో దిగడం అదే మొదటి సారి. బహ్మోస్ మొదటి దెబ్బ పాక్ రుచిచూసింది. మరో ఈ రెండో వెర్షన్ రుచిచూసే దేశం ఏదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa