సోషల్ మీడియాలో తన పేరుతో వైరల్ అవుతున్న ఓ ఫేక్ న్యూస్పై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్రంగా స్పందించాడు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ల గురించి తాను చేసినట్లుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించాడు. అది పూర్తిగా అవాస్తవమని, అలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని హితవు పలికాడు.ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైన తర్వాత ఈ ఫేక్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ‘‘2027 ప్రపంచకప్ గెలవాలంటే అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్లను వెంటనే తొలగించాలి. రోహిత్ శర్మకు తిరిగి గౌరవంగా కెప్టెన్సీ అప్పగించాలి’’ అని సిద్ధూ వ్యాఖ్యానించినట్లుగా ఓ సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వేగంగా వైరల్ కావడంతో సిద్ధూ స్వయంగా రంగంలోకి దిగాడు.ఈ ప్రచారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన సిద్ధూ.. ‘‘నేను ఎప్పుడూ అలా అనలేదు. దయచేసి ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి. కనీసం అలాంటిది ఊహించను కూడా లేదు. ఇది సిగ్గుచేటు’’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చాడు. సిద్ధూ స్పందనతో సదరు యూజర్ తన పోస్ట్ను డిలీట్ చేశాడు.ఆదివారం పెర్త్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. వర్షం కారణంగా కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. సుమారు ఏడు నెలల తర్వాత బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ డకౌట్ కాగా, రోహిత్ శర్మ 8 పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం ఆస్ట్రేలియా 21.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్లో జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa