ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కి సవాల్ విసిరిన తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్

international |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 02:25 PM

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను లక్ష్యంగా చేసుకుని తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) తీవ్రవాద సంస్థ సవాల్ విసిరింది. "సాధారణ సైనికులను చనిపోయేందుకు పంపడం ఆపి, ధైర్యముంటే ఉన్నతాధికారులు యుద్ధ క్షేత్రంలోకి రావాలి" అంటూ ఆ సంస్థకు చెందిన ఓ కీలక కమాండర్ హెచ్చరికలు జారీ చేశాడు. ఈ మేరకు విడుదల చేసిన వరుస వీడియోలు పాకిస్థాన్ సైనిక నాయకత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి.పాక్ అధికారుల సమాచారం ప్రకారం, వీడియోలో కనిపించిన వ్యక్తిని టీటీపీ సీనియర్ కమాండర్ కాజిమ్‌గా గుర్తించారు. "నువ్వు నిజమైన మగాడివైతే మాతో పోరాడు. తల్లిపాలు తాగిన వాడివైతే మాతో యుద్ధం చెయ్" అంటూ అతడు నేరుగా ఆర్మీ చీఫ్‌ను ఉద్దేశించి సవాలు విసిరాడు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పాకిస్థాన్ ప్రభుత్వం, ఈ నెల 21న కమాండర్ కాజిమ్ ఆచూకీ తెలిపిన వారికి 10 కోట్ల పాకిస్థానీ రూపాయల (పీకేఆర్‌) రివార్డును ప్రకటించింది.ఈ నెల‌ 8న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాలో పాక్ సైన్యంపై జరిపిన మెరుపుదాడికి సంబంధించిన దృశ్యాలను కూడా టీటీపీ విడుదల చేసింది. ఈ దాడిలో 22 మంది సైనికులను హతమార్చామని, వారి ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నామని టీటీపీ ప్రకటించింది. అయితే, ఈ ఘటనలో 11 మంది సైనికులు మాత్రమే మరణించారని పాకిస్థాన్ సైన్యం అధికారికంగా అంగీకరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa