పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టమని తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. జగన్ హయాంలో కొంతమంది రాజకీయ నేతల అండదండలు చూసుకొని వేంకటేశ్వరస్వామి సొమ్ములు కాజేశారని ఆరోపించారు. శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన సొమ్మును కాజేసిన దొంగను పట్టుకోకుండా.. ఇంకొందరూ వ్యక్తులు కలిసి కాజేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఫైర్ అయ్యారు భానుప్రకాష్ రెడ్డి. పరకామణి వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దొంగలను పట్టుకుంటామని హెచ్చరించారు. అయితే, పరకామణి వ్యవహారం గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. తాను టీటీడీలో రేపు ఉంటానో, ఉండనో తెలియదని చెప్పుకొచ్చారు. పరకామణి వ్యవహారంలో మీడియా సమావేశం పెట్టకుండా కొంతమంది తనపై విపరీతమైన ఒత్తిడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa