నాగుల చవితి నాడు అరుదైన దృశ్యం అగుపించింది. పర్వదిన వేళ రెండు నాగు పాములు ఒకేసారి శివలింగాన్ని చుట్టుకొని భక్తులను ఆశ్చర్యపరిచాయి. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చెర్లోపల్లి రైల్వేగేట్ వద్ద ఉన్న విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ వింత చోటుచేసుకుంది. దీని గురించి ఆలయ అర్చకులు శ్రీనివాసులు వివరణ ఇచ్చారు. నాగుల చవితి సందర్భంగా ఏటా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం, అభిషేకాలను నిర్వహిస్తామని, ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి అక్కడే నిద్రించామని చెప్పారు.ఈ క్రమంలో అర్ధరాత్రి దాటాక దాదాపు 3 గంటల సమయంలో నాగుపాములు బుసలు కొడుతూ శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కనిపించాయని వెల్లడించారు . కొంచెంసేపటి తర్వాత వెనుక ఉన్న పుట్టలోకి రెండు నాగు పాములు వెళ్లిపోయినట్లు అర్చకుడు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa