ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సావరిన్ గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్-I ముందస్తు విమోచన ధర ప్రకటన

business |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 08:40 PM

సావరిన్ గోల్డ్ బాండ్లలో  పెట్టుబడి పెట్టిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  శుభవార్త చెప్పింది. SGB 2020-21 సిరీస్-I బాండ్ల ముందస్తు విమోచన  ధరను ప్రకటించింది. ఒక్కో యూనిట్‌కు రూ. 12,198గా ధరను ఖరారు చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బాండ్లను రీడీమ్ నగదు రూపంలోకి మార్చుకోవడం చేసుకునేందుకు ఇన్వెస్టర్లకు మంగళవారం  నుంచి అవకాశం కల్పించారు.ఈ సిరీస్ బాండ్లను జారీ చేసినప్పుడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి గ్రాముకు రూ. 4,589కే లభించాయి. ఆఫ్‌లైన్‌లో కొన్నవారు గ్రాముకు రూ. 4,639 చెల్లించారు. ఇప్పుడు ఆర్బీఐ ప్రకటించిన విమోచన ధరతో పోలిస్తే, కేవలం ఐదేళ్ల కాలంలోనే పెట్టుబడి విలువ దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఆన్‌లైన్ ఇన్వెస్టర్లకు సుమారు 166 శాతం సంపూర్ణ రాబడి లభించినట్లయింది. అంతేకాకుండా, ఈ ఐదేళ్ల కాలానికి ఇన్వెస్టర్లు ఏటా 2.5 శాతం వడ్డీని కూడా అదనంగా పొందారు.ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రచురించిన 999 స్వచ్ఛత కలిగిన బంగారం ధరల ఆధారంగా ఈ విమోచన ధరను లెక్కించినట్లు ఆర్బీఐ వివరించింది. అక్టోబర్ 23, 24, 27 తేదీల్లోని మూడు పనిదినాల సగటు బంగారం ముగింపు ధర ఆధారంగా యూనిట్‌కు రూ. 12,198గా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం, బాండ్ జారీ చేసిన ఐదో సంవత్సరం తర్వాత వచ్చే వడ్డీ చెల్లింపు తేదీల్లో వాటిని ముందస్తుగా విమోచనం చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.బంగారం దిగుమతులను తగ్గించి, ప్రజల పొదుపును ఆర్థిక ఆస్తుల వైపు మళ్లించే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2025 నవంబరులో సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. ఈ బాండ్లకు 8 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. అయితే, 5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చే వెసులుబాటు ఉంది. వీటిని స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడ్ చేయవచ్చు, ఇతరులకు బదిలీ చేయవచ్చు లేదా బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు హామీగా కూడా ఉపయోగించుకోవచ్చు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa