ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులిచింతల పోటెత్తిన వరద నీరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 30, 2025, 01:31 PM

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తింది. ప్రాజెక్ట్‌కు 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో.. అధికారులు 4 లక్షల 90 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్‌కు 2 లక్షల 74 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరింది. దీంతో అధికారులు బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌కు మున్నేరు, కీసర, వైర, కట్టలేరు నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. ఈరోజు (గురువారం) సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్‌కు పులిచింతల నుంచి సుమారు 4 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్‌కు సాయంత్రానికి సుమారు 5 నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరద చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బ్యారేజ్ దిగువ భాగాన ఉన్న కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలలోని నదీతీర మండలాలు, గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. లంక గ్రామాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని అధికారులు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa